నైజీరియాలో కూలిన 21 అంతస్తుల భవనం, పెరుగుతున్న మృతులు
లాగోస్లో నిర్మాణంలో ఉన్న 21 అంతస్తుల భవనం సోమవారం కుప్పకూలింది. నైజీరియా వాణిజ్య రాజధానిలో ఈ ఘటన జరిగింది. అయితే భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గురువారం నాడు కుప్ప కూలిన భవన శిథిలాల నుంచి మరో 16 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 38కు చేరింది. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు.
ఈ ఘటనాస్థలంలో వరుసగా నాలుగో రోజు కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.మృతిచెందిన వారిలో 33 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.