ఏపీ: గ్రేడులు మానేసి.. మళ్లా మార్కుల విధానమే అమలు

ఏపీ: గ్రేడులు మానేసి.. మళ్లా మార్కుల విధానమే అమలు
ఏపీలో పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానాన్ని మార్చుతూ ఏపీ ప్రభుత్వ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకువస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. విద్యార్ధుల్లో ప్రతిభ ఆధారంగా మార్కుల విధానమే సరైదంటూ.. విద్యావేత్తలు, నిపుణులు సలహాల మేరకు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సిఫార్సులు చేశారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించేందుకే.. CBSE ని అనుసరించే గ్రేడింగ్ విధానాన్ని 2019 వరకూ అమలు చేసామన్న ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంతో 2020లో పదో తరగతి పరీక్షలు రద్దు కావటంతో గ్రేడ్ పాయింట్లు ఇవ్వని పాఠశాల విద్యాశాఖ…. కరోనా ప్రభావంతో పరీక్షలు రద్దు కావటంతో 2021లోనూ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలంటూ హైపవర్ కమిటీ సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇంటర్ లో ప్రవేశాలు, నియామకాల్లో తలెత్తుతున్న ఇబ్బందుల దృష్ట్యా 2020 విద్యా సంవత్సరం నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొంది పాఠశాల విద్యాశాఖ.