Den Mark Open: క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు
Den Mark Open: క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు
ప్రపంచ పటంలో భారత పతాకాన్ని రెప రెపలాడించి.. రెండు సార్లు ఒలింపిక్స్ పతకం విజేత.. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటుతోంది. అయితే ఆమె డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. రెండో రౌండ్ ముగిసే సమయానికి 67 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. అయితే ఈ మ్యాచ్లో 21-16, 12-21, 21-15 తేడాతో థాయ్లాండ్కు చెందిన బుసానన్పై పీవీ సింధు గెలిచింది. ఆగస్టు నెలలో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన అనంతరం పీవీ సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
డెన్మార్గ్ లో మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొంటున్న పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్లో తొలి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శన చేసింది. తొలి రౌండ్లో టోర్నీకి చెందిన నెస్లిహాన్ యిగిట్ను ఓడించిన పీవీ సింధు..రెండో రౌండ్లో బుసానన్ను ఓడించింది. అయితే బుసానన్ తో జరిగిన మ్యాచ్ లో హోరాహోరాగా పీవీ సింధు గంటకు పైగా పోరాడి విజయ కేతనం ఎగురవేసింది.