దివంగత నటుడి దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆస్పత్రిలో చేరిక

దివంగత నటుడి దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆస్పత్రిలో చేరిక
దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే ఆమెని ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా బిపీ సంబంధిత వ్యాధితో భాధ పడుతున్నట్లు.. అందుకే ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దివంగత బాలీవుడ్ నటుడు లెజండ్రీ దిలీప్ కుమార్ మరణంతో కుంగిపోయిన ఆమె అనారోగ్యం బారిన పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. అప్పటి నుంచే ఆమె చాలా అనారోగ్యానికి గురైందని.. రక్తపోటుతో సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చామని ఆమె స్నేహితులు చెబుతున్నారు.