E Bike Go: మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్..

E-Bike Go: దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎలక్ట్రిక్ బైక్ల వైపు మళ్లింది. బహుశా రాబోయే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అని చెప్పవచ్చు. దీనికి తోడు ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. వాస్తవానికి రెండు నెలల క్రితం మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన E-Bike Go తన ఎలక్ట్రిక్ బైక్కు లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది. కాగా దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ బైకులు తయారుచేసే ఆటోమొబైల్ కంపెనీలకు రాయితీలు ఇస్తోంది.
కాగా, రెండు నెలల క్రితమే స్వదేశీ కంపెనీ e-Bike Go రెండు స్కూటర్లను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటికి R1GE, G1+అనే పేర్లు నామకరణం చేసిన సదరు సంస్థ. వీటి ప్రారంభ ధర రూ.85 వేలు కాగా ఇప్పుడు రూ.1.05 లక్షలకు చేరుకుంది. ఈ ధర కంపెనీది సబ్సిడీ కలిగి ఉండదు. దీపావళికి పండుగ కోసం రగ్డ్ స్పెషల్ బైక్ లాంచ్ చేశారు. అయితే ఇది వాహన ప్రియులను ఆకట్టుకునే విధంగా ఇవి రెడ్, బ్లూ, బ్లాక్, రగ్డ్ స్పెషల్ ఎడిషన్ అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో ఉన్నాయి. E-Bike Go రగ్డ్ అనేది ‘అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్ గా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా దేశ వ్యాప్తంగా E- Bike Go మొత్తం 22 డీలర్షిప్లను ఏర్పాటు చేశామని ప్రకటించింది. కంపెనీ ప్రకారం ఇది రాబోయే నెలల్లో 50,000 బుకింగ్లను లక్ష్యంగా చేసుకుంది.
E- Bike Go ప్రత్యేకతలు:
సింగిల్ ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది. ఈ రగ్డ్ EV అనేది 3kW మోటార్ టార్క్ తో ఉంటుంది. ఇది మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి. ఈ బైకు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు.
ఇ-బైక్లో ఓ ప్రత్యేకత ఏంటంటే 2 x 2 kWh బ్యాటరీని మార్చవచ్చు. దాదాపు 3.5 గంటల్లో బ్యాటరినీ ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిమీల వరకు వెళ్లొచ్చునని సదరు కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రారంభ ధర రూ. 84,999. దీనిని కేవలం రూ.499 చెల్లించి ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చునని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే ముడిసరుకు ధరలు పెరిగితే ఈ బైకు ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులంటున్నారు.