దేశంలో టాప్100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం

దేశంలో టాప్100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం
వరుసగా మూడోసారి ఐఐటీ- మద్రాస్ టాప్ ప్లేస్
దేశంలో టాప్ 100 విద్యా సంస్థలకు కేంద్ర విద్యాశాఖ ర్యాంకింగ్స్ ప్రకటించింది. 2021 ఏడాదిగాను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (NIRF)నివేదికను వర్చువల్ విధానంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 6 అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు కేంద్రమంత్రి.
తొలి ర్యాంక్ ఐఐటీ మద్రాస్ (IIT MADRAS)
దేశ వ్యాప్తంగా కేటగిరీలో తొలి ర్యాంక్ (IIT MADRAS) సాధించింది.ఇంజినీరింగ్ విభాగంలోనూ ఐఐటీ మద్రాస్ టాప్ ప్లేస్ ఉంది. అయితే వరుసగా మూడోసారి ఈ ఘనతను ఐఐటీ మద్రాస్ సొంతం చేసుకుంది.
రెండో స్థానంలో బెంగళూరు IISC
ఈ ర్యాంకింగ్స్లో (IISC)బెంగళూరు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
మూడో స్థానంలో బాంబే
మూడో స్థానంలో ఐఐటీ-(IIT BOMBAY)బాంబే నిలబెట్టుకుంది. ఈ మూడు దేశంలోని మొదటి మూడు అత్యున్నత విద్యాసంస్థలుగా నిలిచాయి.
ఆ తర్వాతి తొలి పది స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువాహటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU)లు విద్యాసంస్థలున్నాయి.
తొలి పది స్థానాల్లో లేని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ( JNU) లేకపోగా… కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అవి జామియా మిలియా ఇస్లామియా (JMI), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వంటి యూనివర్శిటీలు.. అయితే గతేడాది JMI 10వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. అయితే ఇసారి హైదరాబాద్లోని (HCU) హెచ్సీయూ మాత్రం 6 నుంచి 9వ స్థానానికి పడిపోయింది.