JEE Main 2021 Result: తొలి ర్యాంకులతో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జేఈఈ మెయిన్ ఫలితాలు..తొలి ర్యాంకులతో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..
దేశీయంగా JEE Main ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. JEE మెయిన్ (4వ విడత) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించినట్లు NTA తెలిపింది.
అభ్యర్థులు ఫలితాలను చూసుకోవాలంటే తమ అధికారిక వెబ్సైట్లు jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.inలో చూసుకోవచ్చు అని తెలిపింది.
పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి JEE Main Result కోసం అభ్యర్థులు గత 3 రోజుల నుంచి ఎప్పుడా ఎప్పాడా అని వేచి చూస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరుగురు విద్యార్థులు ఫస్ట్ ర్యాంకు సాధించారు.
ANDHRAPRADESH: 1) దుగ్గినేని వెంకట పనీష్, 2) పసల వీరశివ, 3) కాంచనపల్లి రాహుల్ నాయుడు, 4)కరణం లోకేష్
TELANGANA: 1)కొమ్మ శరణ్య, 2) జోస్యుల వెంకట ఆదిత్య ఫస్ట్ ర్యాంకులో నిలిచారు.
JEE Main Examలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం ఇదే తొలిసారి. నాలుగో విడతలో మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు. JEE Main Examలో సంవత్సరానికి 4 సార్లు Exam నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 1 విడతలో హాజరైన 6.61 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. రెండో విడత Examకు 6.19 లక్షల మంది, మూడో విడత ఎగ్జామ్ కు 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
JEE Main Examను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అస్సామీ, గుజరాతీ కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, మలయాళం, పంజాబీ, తమిళం, ఉర్దూతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు.
JEE Main results to be declared today: Ministry of Education pic.twitter.com/kX8yW1riHo
— ANI (@ANI) September 14, 2021
National Testing Agency (NTA) releases JEE Main results; 44 candidates get 100 percentile, 18 candidates on rank 1 pic.twitter.com/GO8vEfaZCd
— ANI (@ANI) September 14, 2021