‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్ విడుదల

‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్ విడుదల
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్తేజ్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ‘కొండపొలం’. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్కు జోడీగా నటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్లకు విశేషణ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్సాంగ్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా’ అంటూ సాగే పాట… అభిమానులను సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్.. నటి రకుల్ ప్రీతి సింగ్ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తిప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్. ఈ సాంగ్లో వైష్ణవ్-రకుల్ మధ్య సెక్సీ కెమిస్ట్రీ బాగా నడిచింది. అయితే ఈ కెమెస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆలరించింది.
ఈ ప్రేమ జంట లవ్ ట్రాగ్ పాటకు అట్రాక్షన్గా నిలిచిందని చెప్పుకొవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ M.M కీరవాణి సంగీతం సారధ్యంలో ఈ పాటను గాయకులు సత్య యామిణి, PVNS రోహిత్లు ఆలపించారు. ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్లు పాటకు సాహిత్యం అందించారు. ఈ సినిమాను ఓ నవల ఆధారంగా కొండపాలెం చిత్రాన్ని రూపొందిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ థియేటర్లలోనా.. లేక ఓటీటీ లోనా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.