భోజనం తర్వాత నడకతో షుగర్ కు చెక్..!

భోజనం తర్వాత నడకతో షుగర్ కు చెక్..!
రోజు భోజనం చేసిన తరువాత పది నిమిషాల పాటు నడిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయని ఓ రీసెర్స్ లో తెలింది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్పల్ప నడకతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చట! అంతేకాదు రోజు అరగంట పాటు నడక కన్నా భోజనం తర్వాత స్పల్ప నడక వల్లే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతయాని న్యూజిలాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు పరిశోధించి తెలిపారు. అయితే 41 మంది టైపు 2 మధుమేహ రోగులను ఒక వారం పాటు రోజూ వారికి ఇష్టమైన సమయంలో 30 నిమిషాల పాటు నడవమని ఆ డాక్టర్లు తెలిపారు. కొంత కాలం తర్వాత మరో వారం రోజుల పాటు భోజనం చేశాక 10 నిమిషాలు నడిపించారు. దీంతో రోజు అరగంట నడిచిన వారి కన్నా.. భోజనం తర్వాత 10 నిమిషాల పాటు నడిచిన వారిలో సగటున బ్లడ్ షుగర్ లెవెల్స్ 12 శాతం వరకూ తగ్గిపోయాయని గుర్తించారు. రాత్రి భోజనం తర్వాత నడిచిన వారిలో ఏకంగా 22 శాతం వరకూ బ్లడ్ షుగర్ తగ్గినట్లు తేలింది.