మాజీ ప్రధాని మన్మోహన్ పై హెల్త్ బులిటెన్ విడుదల
మాజీ ప్రధాని మన్మోహన్ పై హెల్త్ బులిటెన్ విడుదల
ఢిల్లీలోని ఎయిమ్స్ లో మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ డెంగ్యూతో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందని, డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారని…డాక్టర్ నితీష్ నాయక్ నాకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మన్మోహన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని తెలిపారు.