తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్
నర్సింగ్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా నర్సింగ్ విద్యార్థులు స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి…ఈ నేపధ్యంలో జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే కరోనా టైంలో తెలంగాణలో వీరి సేవలు అందుకున్నారు.
దీంతో తెలంగాణలో GNM, BSC నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్టైఫండ్ నెలకు రూ.1500లు నుంచి రూ.5 వేలకు పెంచింది. దీంతో పాటుగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలు చేయగా..మరియు మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8 వేలకు పెంచింది.
వీరితో పాటు ఎమ్మెస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9 వేలకు, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.10 వేలకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనిపట్ల మెడికల్ విద్యార్థులు తెలంగాణ సర్కార్ కు అభినందనలు వ్యక్తం చేశారు.