క్రీడల పట్ల అందరూ చూపించే అభిమానమే.. ధ్యాన్ చంద్ కు గొప్పనివాళి

క్రీడల పట్ల అందరూ చూపించే అభిమానమే.. ధ్యాన్ చంద్ కు గొప్పనివాళి
మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్కు ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల చూపించే అభిమానమే ధ్యాన్చంద్కు గొప్ప నివాళి అని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ లోని అందరి భాగస్వామ్యంతోనే ప్రపంచ పతాక స్థాయిలో క్రీడల్లో ఉన్నత శిఖరాలకు భారత్ చేరుకుందని అన్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని ప్రధాని క్రీడాకారుల్ని ప్రశంసించారు. భారత్ సాధించిన 7 పతకాలలో.. ఎన్నో ఏళ్ల తరువాత హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగించాలని ప్రధాని ఆకాంక్షించారు.