శ్రీముఖి ఇన్ “ క్రేజీ అంకుల్స్” ట్రైలర్ విడుదల

శ్రీముఖి నటించిన “ క్రేజీ అంకుల్స్” ట్రైలర్ విడుదల
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో ఇ.సత్తి బాబు డైరెక్షన్ లో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం “క్రేజీ అంకుల్స్”. ఆగస్టు 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పాట, మాటల మాంత్రికుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా.. ముఖ్య పాత్రల్లో బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి నటిస్తున్నారు. కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆర్ఆర్ఆర్ – రాజు (రాజా రవీంద్ర), రెడ్డి (మనో) మరియు రావు (భరణి) క్రేజీ కామెడీతో నిండిపోయింది. బండ్ల గణేష్, ప్రవీణ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా వినోదాన్ని తెరకెక్కించారు. మొత్తం మీద క్రేజీ అంకుల్స్ ట్రైలర్ పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. అంతేకాకుండా సినిమాపై అంచనాలను పెంచింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రస్తుతం 50 లక్షల వ్యూస్ తో హల్చల్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. దీంతో ఈ నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారని చిత్రయూనిట్ తెలిపింది.
#GoodFriends #GoodCinemaGroup #CrazyUncles