వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్.. నవంబర్ 13న ఫైనల్..
దుబాయిలో టీ-20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఐసీసీ రెండేళ్లకొకసారి ప్రపంచకప్ నిర్వహిస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా టోర్నీలు వాయిదాలు పడుతూనే వస్తోంది. వచ్చే ఏడాదిలోనే టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో తాజా ఛాంపియన్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్లకు సంబంధించిన వేదికలను ప్రకటించిన అధికారులు. మొత్తం 7 నగరాల్లో ఈ ప్రపంచకప్ మ్యాచ్లు జరుగుతాయని, చారిత్రాత్మక మెల్బోర్న్ మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ నిర్వహిస్తామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ తెలిపారు.
గతేడాది జరిగిన మహిళల టీ-20 ప్రపంచకప్కు ఆస్ట్రేలియాలో జరిగాయి. అదే స్ఫూర్తితోనే మరో ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్లు జరగనున్నాయి.
ఆస్ట్రేలియాలో జరిగే ప్రదేశాలు: అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్, హోబర్ట్, సిడ్నీ, గీలాంగ్, మెల్బోర్న్ నగరాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తాజా ఫైనల్లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో పాటు భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా సూపర్- 12కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్ తదితర జట్లు క్వాలిఫయింగ్ టోర్నీల్లో తలపడనున్నాయి. సిడ్నీ, అడిలైడ్లలో సెమీస్లు జరగనుండగా, నవంబర్ 13న మెల్బోర్న్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.