18న హైదరాబాద్ లో టీఆర్ఎస్ మహాధర్నా
ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం తీరుకు నిరసనగా ఎల్లుండి హైదరాబాద్ లో మహా ధర్నా చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై నిరసన గా ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మహా ధర్నా లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా స్వయంగా పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా… గత శుక్ర వారం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే.