31న ఏపీసెట్ ప్రవేశ పరీక్ష

హాజరు కానున్న 36,667 మంది విద్యార్థులు
నిమిషం నిబంధన అమలు
ఉదయం 9:30 నుంచి 12:30 వరకు
ఈ నెల 31న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష 2021 ఏపీసెట్, పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని, గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతి. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఏపీసెట్కు 36,667 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్, మాస్క్తో ధరించి హాజరు కావాలి. తమ వెంట వాటర్ బాటిల్ను తెచ్చుకోవచ్చుని తెలిపారు. ఏపీ సెట్ ఎగ్జామ్ రాసేవారు దివ్యాంగులు ఒక రోజు ముందుగానే సహాయకుని కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాల్టికెట్లు www.apset.net.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.