మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు సి.పి. రాధాకృష్ణన్ 2025 సెప్టెంబరు 9న భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో 452 ఓట్లు పొందారు. విపక్ష ఇండియా బ్లాక్ కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి (323 ఓట్లు)ని ఓడించారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ జూలై 2025లో అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది.
కొత్త ఉపరాష్ట్రపతి ప్రొఫైల్

సి.పి. రాధాకృష్ణన్ ఒక అనుభవజ్ఞుడు రాజకీయ నాయకుడు, BJP నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆయన తమిళనాడులో గౌండర్-కొంగు వెళ్లళార్ కి చెందినవారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా, రాజ్య సభచైర్మన్ (ఎక్స్-ఆఫిషియో) గా వ్యవహరిస్తారు.
ఎన్నిక ప్రాముఖ్యత
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో NDA అభ్యర్థిగా ఆయన ఈజీగా విజయం సాధించారు. ఇండియా బ్లాక్ నేతృత్వంలో విపక్షాలు సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా వివిధ రాజకీయ నాయకులు రాధాకృష్ణన్ను అభినందించారు, శక్తివంతమైన నాయకత్వం కలిగిన వ్యక్తి ఎన్నికయ్యారని అన్నారు.