Karthika Masam 2024: శివ కేశవుల మాసం… ఏ పూజలు ఎందుకు ?

Karthika masam

శివుడు, విష్ణువు ఇద్దరికీ ఎంతో ఇష్టమైనది ఈ కార్తీకమాసం. ఇద్దరికీ ఇష్టమైన ఈ మాసంలో కార్తీక పురాణం చదువుకోవాలి. అందులో ఏ దేవుడికి ఏ అధ్యాయం ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ ఏడాది ఎప్పటి నుంచి కార్తీకం ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది ?

న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్

అంటే… కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం.

దీపావళి నాటి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. ఆ తెల్లారి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 31 న దీపావళి వచ్చింది. నవంబరు 1 సూర్యోదయం వరకూ అమావాస్య ఉండడంతో.. నవంబరు 2 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది.

కార్తీకం ప్రారంభం రోజున ఏం చేయాలి ?

బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం, దీపం వెలిగించి… కార్తీకమాసాన్ని ప్రారంభించాలి. . సుర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీకమాసం ప్రారంభంగా లెక్కలోకి తీసుకుంటారు. అప్పుడు… నవంబరు 02 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోందని పండితులు చెబుతున్నారు.
అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీకమాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసం. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు.

ఆ పరమ శివుడికి గా ఎంతో ఇష్టమైనది కార్తీకం. ఈ మాసం అంతా శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు పాటించాలి. అప్పుడే ఆ శంకరుడి అనుగ్రహం పొందుతాం. కార్తీకమాసంలో ఏ శివాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ భక్తులు శివుడి అనుగ్రహించమని వేడుకుంటారు. అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యేది కూడా ఈ నెలలోనే. కార్తీక మాసం మొదటి రోజు నుంచి మకర సంక్రాంతి వరకు దీక్షలు చేస్తారు. శివాలయంలో భక్తులు అభిషేకాలు చేస్తూ తమ దోషాలు తొలగిపోవాలనీ… తమను బాధల నుంచి గట్టెక్కించమని విష్ణువు, శివుడిని కోరుకుంటారు.

శివారాధన ఎలా చేయాలి ?

కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ దళాలతో అర్చన చేస్తే… స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఆ రోజు పవిత్ర నదీ స్నానం చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి నాటి నిండు చంద్రుడి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదంటే అవకాశం ఉన్నవాళ్ళు… చెరువులో విడిచిపెడతారు.

Lord Shiva

కార్తీక సోమవారాలు విశిష్టత

కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత విశిష్టమైనవి. ఆ రోజు శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రదోష కాలంలో చేసే శివారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా మహిమ ఉంది. భక్తులు సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కొందరు కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు. ఈ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఏ రోజు అయినా పూజలు, వ్రతాలు, నోములు జరుపుకోవచ్చు. కార్తీక మాసం అంతా కార్తీక పురాణం చదివిన వారికి విన్న వారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది. పెళ్ళయి మహిళలకు వైధవ్యం రాదని నమ్ముతారు.

ఉసిరి పూజ ఎందుకు ?

కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసం. అందువల్ల ఉసిరి చెట్ల కింద భోజనం చేస్తారు. అంటే వన భోజనాలు అన్నమాట. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా చాలా శుభప్రదం.

అయ్యప్ప దీక్ష

కార్తీక మాసం మొదటి రోజు నుంచే అయ్యప్ప స్వామి దీక్షలు మొదలవుతాయి. 41 రోజుల పాటు భక్తులు మండల పూజ దీక్ష చేపడతారు. ఈ సమయంలో భక్తులు కఠినమైన నియమాలు ఆచరిస్తూ ఉపవాసాలు పాటిస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించి నిత్యం పూజలు, భజనల్లో పాల్గొంటారు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు పునీతులు అవుతారు.

Watch this Video : అయ్యప్ప స్వాములు ఈ ఆహారం తినొద్దుhttps://youtu.be/B0YIly36q1w?si=Sox_vsHWMZ9WkjD4

కార్తీకమాసంలో సోమవారం, జ్వాలాతోరణం శంకరుడి ప్రాముఖ్యత తెలియజేస్తాయి. అలాగే బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీమహావిష్ణువుని గుర్తు చేస్తాయి. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడి ప్రాముఖ్యత తెలియజేస్తే… చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి వివరిస్తాయి. ఈ ఏడాది నవంబరు 02 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది… డిసెంబరు 01 తో ముగుస్తోంది..

హిందూ బంధువులందరికీ నమస్కారం…

హిందువుల పండగలు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అందరికీ తెలియజేయడానికి మనం మహర్షి భక్తి పీఠం అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాం. ఈ ఛానెల్ ను ప్రతి ఒక్క హిందువు subscribe చేసుకోండి. ఈ లింక్ కింద ఇస్తున్నాను.

Subscribe మహర్షి భక్తి పీఠం https://www.youtube.com/@maharshibhakthi

NOTE:
ఈ కథనాన్ని కొందరు పండితులు, వివిధ ఇంటర్నెట్ మాధ్యమాల నుంచి తీసుకొని రాయడమైనది. చాలా వరకూ దోషాలు రాకుండా భక్తుల విశ్వాసలు దెబ్బతినకుండా రాస్తున్నాం. మరింత సమాచారం కావాలి అనుకునేవారు హిందూ పండితులను సంప్రదించగలరు.

 

author avatar
Vishnu Kumar
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
Vishnu Kumar  के बारे में
Vishnu Kumar Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms. Read More
For Feedback - telanganaexams@gmail.com