సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విజయవంతమవుతూ, విక్టరీ వెంకటేశ్ కెరీర్లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా సుమారుగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘన విజయం తర్వాత వెంకటేశ్ తన తదుపరి సినిమా ఎంపికలో చాలాచొప్పిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్పై పలు రోజులుగా చర్చలు సాగుతుండగా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమాకోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తుండగా, ఇటీవల వెంకటేశ్తో కలిసి కథా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ సినిమా సెట్స్పైకి ఈ ఏడాది చివరిలో వెళ్లే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించనున్నట్టు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
వెంకటేశ్ త్రివిక్రమ్ కలయికలో ఇది మొదటి సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ మాజిక్ మళ్లీ తిరిగి చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.