Post Views: 107
బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు తమ ప్రత్యర్థులను దెబ్బతీసే శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వివాదాన్ని ఉపయోగించి నాయకులు తమ రాజకీయ అజెండాను నడిపిస్తూ, జనంలో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహం
రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెలంగాణకు నష్టమనీ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించుకుపోడానికే బనకచర్ల కడుతున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి ఏపీ సీఎం జగన్తో 2017, 2019లో రహస్య ఒప్పందాలు చేశారని, అది తెలంగాణకు ద్రోహమని రేవంత్ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ గతంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినా, ఇప్పుడు వ్యతిరేకిస్తోందని, దీన్ని బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిగా రేవంత్ విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టును టెక్నికల్గా, రాజకీయంగా, చట్టపరంగా అడ్డుకుంటామని సీఎం ప్రకటించారు. ఇదే సమయంలో, బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేకమని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రాకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంతో కేసీఆర్ను ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఆంధ్రలో చంద్రబాబు పొలిటికల్ గేమ్
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రాయలసీమ అభివృద్ధికి కీలకమని చెబుతున్నారు. గత జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, జగన్ రాయలసీమ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎంను రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తూ, తాను రాయలసీమ రక్షకుడిగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్పీడప్ చేస్తుందని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
రాజకీయ సెంటిమెంట్గా బనకచర్ల
బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ సెంటిమెంట్ను రేకెత్తించే రాజకీయ ఆయుధంగా మారింది. రేవంత్, చంద్రబాబు ఈ వివాదాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను దెబ్బతీస్తూ, పాలనా వైఫల్యాలపై చర్చ రాకుండా అజెండాను నియంత్రిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల సీఎంలు తమ రాజకీయ ప్రతిష్ఠను పెంచుకుంటూ, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టివేస్తున్నట్టు కనిపిస్తోంది.
Also read: విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000
Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్తో సరికొత్త అవతారం!
Also read: https://www.ndtv.com/india-news/international-yoga-day-2025-pm-modi-to-participate-in-yoga-day-event-at-visakhapatnam-mega-prep-underway-8718501
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling.
His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes.
A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం
Join Our WhatsApp Channel
బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు తమ ప్రత్యర్థులను దెబ్బతీసే శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వివాదాన్ని ఉపయోగించి నాయకులు తమ రాజకీయ అజెండాను నడిపిస్తూ, జనంలో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహం
రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెలంగాణకు నష్టమనీ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించుకుపోడానికే బనకచర్ల కడుతున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి ఏపీ సీఎం జగన్తో 2017, 2019లో రహస్య ఒప్పందాలు చేశారని, అది తెలంగాణకు ద్రోహమని రేవంత్ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ గతంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినా, ఇప్పుడు వ్యతిరేకిస్తోందని, దీన్ని బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిగా రేవంత్ విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టును టెక్నికల్గా, రాజకీయంగా, చట్టపరంగా అడ్డుకుంటామని సీఎం ప్రకటించారు. ఇదే సమయంలో, బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేకమని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రాకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంతో కేసీఆర్ను ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆంధ్రలో చంద్రబాబు పొలిటికల్ గేమ్
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రాయలసీమ అభివృద్ధికి కీలకమని చెబుతున్నారు. గత జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, జగన్ రాయలసీమ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎంను రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తూ, తాను రాయలసీమ రక్షకుడిగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్పీడప్ చేస్తుందని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
రాజకీయ సెంటిమెంట్గా బనకచర్ల
బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ సెంటిమెంట్ను రేకెత్తించే రాజకీయ ఆయుధంగా మారింది. రేవంత్, చంద్రబాబు ఈ వివాదాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను దెబ్బతీస్తూ, పాలనా వైఫల్యాలపై చర్చ రాకుండా అజెండాను నియంత్రిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల సీఎంలు తమ రాజకీయ ప్రతిష్ఠను పెంచుకుంటూ, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టివేస్తున్నట్టు కనిపిస్తోంది.
Related Post
Also read: విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000
Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్తో సరికొత్త అవతారం!
Also read: https://www.ndtv.com/india-news/international-yoga-day-2025-pm-modi-to-participate-in-yoga-day-event-at-visakhapatnam-mega-prep-underway-8718501
Join Our WhatsApp Channel
---Advertisement---
LATEST Post
Margashira Masam : మార్గశిర మాసంలో లక్ష్మీ కటాక్షం పొందే రహస్య వ్రతం!
Gratuity After 1 Year : ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్
తీర్థం ఎందుకు తీసుకోవాలి ?
Shukra Moudyami 2025 : పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోయాయి? శుక్ర మౌఢ్యమి పై క్లారిటీ!
72 Hours Work Weekపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు.. డాక్టర్ల వార్నింగ్ !