సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా ? కాల్ చేయండి !!

Telangana samagra kutumba survey : రాష్ట్రమంతటా సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు సర్వే పూర్తయిందని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా మంది తమ ఇళ్ళకు సర్వే సిబ్బంది రాలేదనీ… పక్క బజారులో స్టిక్కర్లు అతికించారు… కానీ మా ఇంటికి రాలేదని వాపోతున్నారు.

ఈ వెబ్ స్టోరీ చూడండి : బీట్ రూట్ జ్యూస్… అస్సలు వదలొద్దు !

telangana samagra kutumba survey

ఇది కూడా చదవండి : TG women Loans: తెలంగాణ మహిళలకు వడ్డీలేని రుణాలు… apply ఎలా ?

గ్రేటర్ లో ఎన్ని కుటుంబాలు అంటే !

Greater Hyderabad పరిధిలో సమగ్ర సర్వేకు ముందు 28,32,490 కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇళ్ళ సర్వే పూర్తయ్యాక 23,82,247 కుటుంబాలు మాత్రమే లెక్క తేలింది. దాదాపు 20.11 లక్షల కుటుంబాలను మాత్రమే సిబ్బంది సర్వే చేశారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ? కొందరు సర్వే కోసం వచ్చిన సిబ్బందికి తమ కుటుంబ వివరాలు, వృత్తి, ఉద్యోగాల వివరాలు చెప్పడానికి ఒప్పుకోలేదు. సర్వే స్టార్ట్ అయిన మొదట్లోనే ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. కొందరు సర్వే కోసం వెళ్ళిన టైమ్ లోనే పనుల కోసం, ఆఫీసులకు, వేరే ఊళ్ళకి వెళ్ళిపోయిన సంఘటనలు జరిగాయి. అలా చాలామంది సమగ్ర కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోలేకపోయారు.

telangana samagra kutumba survey

కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి

కారణాలు ఏవైనా సరే… సమగ్ర కుటుంబ సర్వేలో తమ పేరు నమోదు చేసుకోని వారికి GHMC ఓ అవకాశం ఇస్తోంది. వాళ్ళు కాల్ సెంటర్ కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ ఫోన్ నెంబర్ : 040-21 11 11 11 కు కాల్ చేసి నమోదు చేయించుకోవచ్చు. మీరు కాల్ చేసే ముందు…. మీ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, వృత్తి, ఆదాయం, తెల్లకార్డులు ఉందా… ఆధార్ కార్డు నెంబర్ లాంటివి దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అడిగిన వెంటనే టైమ్ వేస్ట్ కాకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu Word Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

CLICK HERE FOR TELEGRAM LINK

author avatar
Vishnu Kumar
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
Vishnu Kumar
Vishnu Kumarhttps://teluguword.com/
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.

Related Articles

1 COMMENT

  1. Govt survey of details related to families and population is supposed to ve carriedout when national sample is announced.

Comments are closed.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles